విషాదం

ఒక్కక్కప్పుడు ఆలోచిస్తే, ఈ ఇతరుల మీది భయం (మనుషులకు ) పొతే నిజమైన ఆనందం ఎంత కలుగుతుందా, ఎన్ని బాధలు ప్రజలకు పోతాయా అని అనిపిస్తుంది.
సత్యాన్ని ఆచరించే ఆరోగ్యమైన బలమైన సంఘం లో నీతి అవినీతి అనే కృత్రిమత ను తీసివేసి అందరూ సహజంగా ఉంటే ఈ దొంగ వేషాలు కల్మషాలు ఉండవు. తమ ప్రకృతి ఎలా ఉంటే అలాగే కనపడటం తప్పు కాదనే సదభిప్రాయం ఒచ్చిన నాడు , ఎంత ధర్మం ఎక్కువవుతుందో ఈ లోకంలో.
జ్వరం వస్తే దాచడు . పైగా కనపడ్డ ప్రతివాడితోనూ చెప్పుకొంటాడు. ఈర్ష తో కాని లోభం తో గాని బాధ పడుతూ ఉంటే అవి దాచేందుకు ఎన్ని వంకర్లో తిప్పి బాధ పడతాడు. ఎప్పటికి ఈ భయాలు పోయి ఈ కృత్రిమ జీవనం లోనించి బైట పడి సహజంగా నిజమైన సౌఖ్యాన్ని, నిజమైన బాధల్ని అనుభవించ గలుగు తామో !
Awesome Inc. theme. Powered by Blogger.